పత్తికొండ మండలం హోసూరులో రైతు మాల హనుమంతు ఏద్దు మంగళవారం విద్యుత్ షాక్ తగిలి మృతి చెందింది. పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న సమయంలో అనుకోకుండా ఎద్దుల బండి గాడి తప్పి పక్కనే ఉన్న 11కేవీ విద్యుత్ వైర్ల ట్రాన్స్ఫారంకు తగలడంతో ఒక ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. రూ.లక్ష నష్టం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చెందారు. రైతుకు నష్ట పరిహారం చెల్లించాలని రైతు నాయకులు మధు, నెట్టికలు కోరారు.