సోన్ మండలం పాక్ పట్ల గ్రామ ప్రభుత్వ పాఠశాలను మంగళవారం ఎంపీడీవో సురేష్ సందర్శించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ... విద్యార్థులకు శుభ్రమైన రుచికరమైన ఆహారం అందించాలని సూచించారు. విద్యార్థుల మూత్రశాలలో పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఉపాధ్యాయులను కోరారు. విద్యార్థులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఆయనతోపాటు ఎంపీవో గోవర్ధన్, ఉపాధ్యాయులు ఉన్నారు.