ఆదోని పట్టణంలో వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా వైసీపీ కార్యాలయం నుంచి జనరల్ హాస్పిటల్ వరకు ర్యాలీ నిర్వహించారు. రైతుల గుండెల్లో వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని ఎమ్మెల్సీ మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.