మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. హవేలీ ఘనపూర్ మండలం రాజీపేట తండ దగ్గర వరదల్లో పదిమంది చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బాధితులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. వాతావరణం అనుకూలించగానే సహాయం అందించేందుకు హెలికాప్టర్ పంపిస్తామని భరోసా ఇచ్చారు. అధికారులు అందరూ సిద్ధంగా ఉన్నారని, అధైర్యపడద్దని సూచించారు.