అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డు లో ఉన్న ఎన్టీఆర్ మార్గ్ వద్ద ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో నారాయణరెడ్డి కాలనీకి చెందిన ఇద్దరికీ గాయాలయ్యాయి. గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.