అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం తాటిచెర్ల సమీపాన గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ద్విచక్ర వాహనం ఢీకొన్న ఆటో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న శరణప్ప అనే వ్యక్తికి తీవ్ర గాయాలువడంతో పరిస్థితి విషమంగా ఉండడంతో మెరిగైన చికిత్స కోసం 108 అంబులెన్స్ సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. రాయదుర్గం నుండి తాటిచెర్ల కు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా తాటిచెర్ల ఉరి బయటే ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.