Udayagiri, Sri Potti Sriramulu Nellore | Aug 21, 2025
అంగన్వాడి కేంద్రాల్లో పని చేసే కార్యకర్త, ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని గురువారం ఉదయగిరి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. గతంలో ఇచ్చిన మొబైల్ ఫోన్లో 2G నెట్వర్క్ కావడంతో ప్రభుత్వ యాప్లు పనిచేయటం లేదని, వాటి స్థానంలో కొత్త ఫోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల వేతనాలు పెంచాలని, ఎస్ఆర్ఎస్ రద్దు చేయాలని అన్నారు.