జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. సంగారెడ్డి జిల్లా కోర్టులో శనివారం పోలీస్ అధికారులతో జరిగిన సమావేశంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. రాజీ కుదుర్చుకునే కేసులను ఈ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చని ఆమె సూచించారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.