కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్టణ శివారులో సోమవారం తెల్లవారుజామున రోడ్డు పక్కన ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఏదైనా వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి శరీరంపై గాయాలున్నాయి. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, మృతుడి వివరాలు కూడా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.