మహమ్మద్ ప్రవక్త జన్మించి 1500 ఏళ్ళు అయిన సందర్భంగా ఆయన జయంతిని పురస్కరించుకుని మిలాద్ ఉన్ నబీ వేడుకలను శుక్రవారం ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. కడప జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు ర్యాలీలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా జమ్మలమడుగు పట్టణంలో జామియా మసీదు, ఆస్థాన ఏ గౌసియా పీఠాధిపతుల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు,పెద్దలు కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. జమ్మలమడుగులోని పలగాడి వీధి, అంబా భవాని వీధి, కూరగాయల మార్కెట్, పాత బస్టాండ్, తాడిపత్రి రోడ్డు మీదుగా ర్యాలీ కొనసాగింది.