యాడికి మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయ ఆవరణలో మంగళవారం డ్రోన్ ల వినియోగంపై రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి సమక్షంలో వ్యవసాయ అధికారులు డ్రోన్ లను వినియోగించి తెగుళ్ల నివారణకు ఎలా మందులు పిచికారీ చేయాలో చక్కగా వివరించారు. ప్రస్తుతం పంటలకు తెగుళ్లు ఆశించాయని డ్రోన్ ల సాయంతో మందులను పిచికారీ చేయాలని రైతులకు సూచించారు.