ఖమ్మం రూరల్ మండలం తీర్థాల నుంచి పోలిశెట్టి గూడెం మద్దివారిగూడెంకు వెళ్లే ప్రధాన రహదారి డాక్యాతండా వద్ద వర్షాల కారణంగా రోడ్డు పూర్తిగా దెబ్బతిని గుంటలుగా మారింది. వరద నీరు చేరడంతో బురదమయంగా మారిన రోడ్డు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దీనితో స్థానిక గిరిజన మహిళలు రహదారిపై వరి నాట్లు వేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. రహదరి పునర్నిర్మాణం చేపట్టాలని వారు కోరుతున్నారు.