Araku Valley, Alluri Sitharama Raju | Aug 13, 2025
అరకులోయ మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద ‘క్విట్-కార్పొరేట్’ నిరసనను బుధవారం చేపట్టారు ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ అధివాసి రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము కూటమి రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాలతో గిరిజన ప్రాంతంలో గిరిజన రైతులకు గిరిజన హక్కుల చట్టాలకు భంగం కలిగిస్తూ పెద్దపెద్ద కార్పొరేట్ ఆదానీ అంబానీ లకు గిరిజనుల భూములు కట్టబెట్టి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం చాలా దురదృష్టకరమనీ, దీన్ని తక్షణమే విరమించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామని అన్నారు.