దానాపురం నుండి హొళగుంద వరకు రోడ్డు బాగు చేయాలని, వివిధ సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు హొళగుంద ఎమ్మార్వో నిజాముద్దీన్ కు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. వినతులు ఇచ్చి మేమే అలసిపోతున్నామని, రోడ్లు మాత్రం రావడం లేదన్నారు. దశాబ్దాలు మారినా మా సమస్య మారడం లేదన్నారు.