స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. శనివారం ఉదయం ఒంగోలు కలెక్టరేట్ లో నిర్వహించిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, సంతనూతలపాడు శాసన సభ్యులు బి.ఎన్. విజయకుమార్, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, ఎపి మాల వెల్ఫేర్ కార్పోరేషన్ చైర్మన్ డా విజయకుమార్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ లతో కలిసి మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు.