Download Now Banner

This browser does not support the video element.

గిద్దలూరు: కొమరోలు మండలం గుంతపల్లె గ్రామ సమీపంలో ఎర్రచందనం తరలిస్తున్న దొంగలను అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ అధికారులు

Giddalur, Prakasam | Aug 21, 2025
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గుంతపల్లె గ్రామ సమీపంలో గురువారం ఎర్రచందనం తరలిస్తున్న ముగ్గురిని తిరుపతి టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 26 ఎర్రచందనం దుంగలు ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని టాస్క్ ఫోర్స్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి తిరుపతి టాస్క్ ఫోర్స్ స్టేషన్ లో మీడియాకు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ.25 లక్షలు ఉంటుందని తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలిస్తున్నామని డిఎస్పి అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us