ఏటూరునాగారంలో మత్స్యకారుడి వలకు ఓ వింత చేప చిక్కింది. సోమవారం సాయంత్రం సూరయ్య అనే మత్స్యకారుడు తుపాకులగూడెం గోదావరి నదిలో చేపలను పట్టుకొని విక్రయానికి ఏటూరునాగారం వచ్చాడు. ఈ క్రమంలో ఆ చేపల్లో దెయ్యం చేప ఉండడంతో అక్కడికి వచ్చిన కొనుగోలుదారులు దాన్ని ఆసక్తిగా తిలకించారు. కాగా, ఈ చేప ఎక్కడ ఉంటే ఆ నీటిలోని ఇతర చేపలను చంపి తినడం, చేపలకు వేసిన ఆహారాన్ని తినడం ఈ చేపకున్న లక్షణాలని మత్స్యకారులు తెలిపారు.