భీమవరంలో కొలువై ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మూసివేశారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ మాట్లాడుతూ.. గ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సోమవారం ఉదయం 8:30 గంటల వరకు ఆలయం మూసివేయబడుతుందని తెలిపారు. సంప్రోక్షణ అనంతరం సోమవారం ఉదయం 8:30 గంటల తర్వాత భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తామని చెప్పారు.