Download Now Banner

This browser does not support the video element.

ధర్మారం: నేరెళ్ల గ్రామంలో మట్టి వినాయకుల తయారీ, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల ర్యాలీ

Dharmaram, Peddapalle | Aug 23, 2025
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలోని అరబిందో హై స్కూల్ విద్యార్థులు శనివారం రోజున వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. మట్టి వినాయకులను స్వయంగా తయారు చేసి, వాటిని వినాయక వేషధారణలో పూజిస్తూ “మట్టి వినాయకులను పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం”, “ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులను నిషేదిద్దాం” అంటూ గ్రామంలోని వీధులలో భారీ ర్యాలీ ప్రదర్శన చేపట్టారు.ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ రవీందర్ మాట్లాడుతూ, మట్టి వినాయకుడిని పూజించడం ద్వారా భక్తి, ముక్తి, శక్తి లభిస్తుందని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us