నల్గొండ పట్టణంలో నూతనంగా నిర్మించిన శిశు విహార్,ఏఆర్ డీఎస్పీ,ఆర్.ఐ,ఆర్ఎస్ఐ క్వార్టర్స్ను రాష్ట్ర రోడ్లు,భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పోలీస్ శాఖ సిబ్బందికి కొత్త వసతులు కల్పించడం ఆనందంగా ఉందని,వారికి తన శుభాకాంక్షలు తెలియజేశారు..రాష్ట్ర వ్యాప్తంగా ₹232 కోట్లతో అవసరమైన ప్రాంతాల్లో పోలీస్ క్వార్టర్స్ నిర్మాణం చేపట్టామన్నారు.