నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గత 5 రోజులుగ కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుందని ఆదివారం ప్రాజెక్టు అధికారులు తెలిపారు.ఇన్ ఫ్లోగా ప్రాజెక్టు లోకి 23460 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి అవుట్ ప్లోగా 26809 క్యూసెక్కుల నీటిని దిగవనున్న గోదావరిలోకి అధికారులు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు 4.699 టీఎంసీలు కాగ ప్రస్తుత నీటి మట్టం 698.975 అడుగులు 4.439 టీఎంసీలలో ప్రాజెక్టు నీటి సామర్థ్యం కొనసాగుతుంది. ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు ప్రవాహ ప్రాంతాలకు వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు.