శ్రీకాకుళం జిల్లా పలాస ముత్యాలమ్మ కోనేరు సమీప కేటీ రోడ్ పై ఆదివారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారునికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పట్టణాల్లో ప్రయాణం చేసేటప్పుడు వాహనదారులు వేగాన్ని నియంత్రించాలని లేని పక్షంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు కోరుతున్నారు.