ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని, కేటాయించిన లబ్ధిదారులు తక్షణమే పనులు పూర్తి చేసుకోవాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు నర్సుల్లాబాద్ మండలంలోని అంకోల్ , కాంసెట్పల్లి నర్సుల్లాబాద్ , గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ళను ఆమె పరిశీలించారు.నిర్మాణంలో ఆలస్యం చేయకుండా ప్రభుత్వం అందిస్తున్న నిధులు, సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇళ్ల పనులను పూర్తి చేయడంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గ్రామ స్థాయి అధికారులు, సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. గ్రామంలో జరుగుతున్న నిర్మాణ పనులను సూచించారు