రాయదుర్గం పట్టణంలోని తహసీల్దార్ రోడ్డు, వేణుగోపాలస్వామి గుడి సమీపంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వైర్లు కాలి నుంచి మంటలు చెలరేగాయి. గత కొద్ది కాలంగా ఈ ట్రాన్స్ ఫార్మర్ వద్ద చెట్లు పెరగడమేకాక వైర్లు వేలాడుతూ ప్రమాదకరంగా మారింది. స్థానికులు పలుమార్లు విద్యుత్ అధికారులకు పిర్యాదు చేసినా పట్టించుకోలేదు. తాజాగా బుధవారం ఉదయం ప్రమాదకర స్థాయిలో మంటలు వచ్ఛాయి. ఆ రోడ్డులో వెళ్ళాలంటే భయపడుతున్నారు.