అవనిగడ్డ పులిగడ్డ వద్ద ఆక్యిడేక్ట్ ను తాకుతూ వరదనీరు ప్రవహిస్తుంది. ఉల్లిపాలెం - భవానీపురం బ్రిడ్జి వద్ద ఉదృతంగా ప్రవహిస్తుండగా, ఉల్లిపాలెం వద్ద కృష్ణానది కరకట్ట కోతకు గురయింది. శుక్రవారం 4 లక్షలకు పైగా క్యూసెకుల వరద నీరు ప్రవహిస్తుంది. రొయ్యల సాగు చేసే రైతుల గుండెల్లో భయాందోళన నెలకొంది. అధికారులు పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.