శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని పుట్టపర్తి మండలం మైలసముద్రం వద్ద మహిళా కూలీలతో వెళుతున్న ఆటోను బొలెరో వాహనం ఢీకొన్న ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో బుచ్చయ్య గారి పల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.