Araku Valley, Alluri Sitharama Raju | Aug 25, 2025
అనంతగిరి మండలంలోని పెదకోట నుంచి జాలడ వరకు ఉన్న తారురోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని సర్పంచ్ గణేష్ ఆదివారం డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. కొన్ని ఏళ్లుగా తారురోడ్డు పూర్తిగా ధ్వంసమై శిధిలావస్థకు చేరి కంకరరాళ్లు తేలి ఉందన్నారు. దీంతో ఈ రహదారి మీదుగా విశాఖ, అరకు, పాడేరుకు రాకపోకలు కొనసాగించేందుకు 300 గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.