భీమవరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గల ఫుట్పాత్ వంతెన మీద నుంచి గుర్తుతెలియని మహిళ యనమదుర్రు మురుగు కాలవలోకి దూకి ఆత్మహత్య కు పాల్పడింది. గమనించిన స్థానికులు సోమవారం మధ్యాహ్నం 4:30 కు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.