Download Now Banner

This browser does not support the video element.

ఖానాపూర్: కడెం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద ఉధృతి,1 గేట్ ఎత్తి దిగువకు నీటిని వదులుతున్న అధికారులు

Khanapur, Nirmal | Sep 8, 2025
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుందని సోమవారం ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఇన్ ఫ్లోగా ప్రాజెక్టు లోకి 2095 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు ఒక్క గేట్ ఎత్తి అవుట్ ప్లోగా 4885 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి అధికారులు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు 4.699 టీఎంసీలు కాగ ప్రస్తుత నీటి మట్టం 698.750 అడుగులు 4.384 టీఎంసీలలో ప్రాజెక్టు నీటి సామర్థ్యం కొనసాగుతుంది. ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు ప్రవాహ ప్రాంతాలకు వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us