రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కొవ్వూరులో వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో రైతు పోరు కార్యక్రమం జరిగింది. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు నాయకత్వంలో ఈ నిరసన చేపట్టారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని తలారి అన్నారు.