అనంతపురం నగరంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తలుపుల మండలంలోని వేపమానిపెంట కు చెందిన రెడ్డి సాబ్ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. ఈనెల 21వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ఆసుపత్రికి అక్కడి నుంచి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.