అమలాపురం మండలం, నడిపూడి రాంజీ కాలనీలో భర్త దొమ్మేటి రాంబాబు(61) ను భార్య వెంకటరమణ ఐరన్ రాడ్ తో కొట్టి హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. రాంబాబు నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగింది. భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆమె పోలీసుల విచారణలో అంగీకరించింది. మృతుడు కాకినాడ ఆర్టీసీ డిపో పరిధిలో స్వ్కాడ్ విధులు నిర్వహిస్తుంటాడు. ఈ ఘటన పై సీఐ ప్రశాంత్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.