ప్రజాస్వామ్యం మన దేశ బలానికి ప్రతీక అని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పేర్కొన్నారు. మంగళవారం పార్లమెంట్లో జరుగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు సహచర ఎంపీలతో తీసుకున్న సెల్ఫీ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'ప్రజాస్వామ్యం మన దేశ బలానికి ప్రతీక, అలాంటి ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామిగా ఉండటం గర్వంగా ఉంది' అని చెప్పుకొచ్చారు.