ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం రాజుపాలెం నందు శనివారం పశు సంవర్ధక శాఖ, మరియు ఆచార్య NG రంగా సర్వీస్ ఫౌండేషన్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిభిరం మరియు రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆచార్య NG రంగా సర్వీస్ ఫౌండేషన్ ఉపాధ్యకుడు నాదెండ్ల చంద్రశేఖరరావు ప్రారంభించినారు. ఈ కార్యక్రమానికి 25 పశువులకు గర్భకోశ వ్యాధి నిర్ధారణ మరియు చికిత్సలు, 42 పశువులకు సాధారణ వైద్య సేవలు, 800 గొర్రెలకు బలవర్ధక మందులు ,125 లేగ దూడలు కు నట్టల నివారణ మందులు పంపిణి చేయడం జరిగింది.