ఈనెల 10వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాకు రానున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు సవితమ్మ రాంప్రసాద్ రెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సభా ప్రాంగణాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తో ప్రత్యేకంగా సభా స్థలానికి సంబంధించిన అంశాలను నిషితంగా పరిశీలించారు. సభ ఏర్పాట్లను పరిశీలించి త్వరితగతిన పనులను పూర్తి చేయాలన్నారు.