అరకులోయ నియోజకవర్గంలో హుకుంపేట ప్రధాన రోడ్డులో హుకుంపేట సీఐ సన్యాసినాయుడు ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు.నిబంధనలు అతిక్రమించి వాహనాలను నడిపే వారిపై చర్యలు తప్పవని ఈ సందర్భంగా హుకుంపేట సీఐ సన్యాసినాయుడు హెచ్చరించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోయినా, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎదుటి వారికీ ప్రమాదమని సీఐ ఈ సందర్భంగా హితబోధ చేశారు.