హోంగార్డ్స్గా పనిచేస్తూ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన 5 మందిని జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ శుక్రవారం రాయచోటి కార్యాలయంలో సన్మానించారు. కృషి, పట్టుదలతో విజయాన్ని సాధించారని అభినందించిన ఎస్పీ గారు, ఉద్యోగంలోనూ అదే నిబద్ధతతో రోల్ మోడల్గా నిలవాలని సూచించారు.ఉద్యోగాలు సాధించిన వారు: బి.సంజీవ్, సి.గంగాధర్, బి.విజయకుమార్ నాయక్, టి.యం.ఖాజాపీర్, యం.నరసింహులు.