అయిజ మండల కేంద్రంలోని సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పిడుగుపడి ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పత్తి పొలంలో పని చేస్తున్న వ్యవసాయ కూలీలు చెట్టు కిందకు వెళ్లగా పిడుగు పడడంతో 5 గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా అందులో ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.