భీమవరంలోని బిజెపి నరసాపురం పార్లమెంట్ కార్యాలయంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో కేంద్ర సహాయం మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ దంపతులు బుధవారం మధ్యాహ్నం 1:00 కు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఘ్నేశ్వరుడు కృపాకటాక్షాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి భీమవరం ఉండి నియోజకవర్గా ల కన్వీనర్ వినోద్ వర్మ, నార్ని తాతాజీ తదితరులు పాల్గొన్నారు