విజయవాడ విద్యాధరపురంలో కొలువైన మహాగణపతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ హాజరైన ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించేందుకు రూ. 30 కోట్లు వ్యయం అవుతుందని, ఈ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో శక్తివంతమైన మహాగణపతిని ప్రతిష్ఠించడం గొప్ప విషయమని ఆయన కొనియాడారు.