రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ డివిజన్లో కార్పొరేటర్ ఆకుల శ్రీవాణితో ఏఈ నావెద్ తో కలిసి సోమవారం విస్తృతంగా పర్యటించారు. రానున్న నవరాత్రుల సందర్భంగా అమ్మవారి మండపాల వద్ద ఎలక్ట్రిసిటీ వైర్లు ఊగుతూ ఉండడంతో ప్రమాదాలు జరగకుండా కేవలం సరి చేయించాలని తెలిపారు. డివిజన్లోని ఎక్కడైనా ఇలాంటి పరిస్థితులు ఉంటే ముందుగానే స్పందించి ప్రజలకు సురక్షితమైన వాతావరణ కల్పించాలని కార్పొరేటర్ సూచించారు.