ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులు పిడుగులతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. మండలంలోని కట్టవారిపాలెంలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పిడుగుపాటుకు మృతి చెందాడు. ఈ ఘటనపై మరింత సమాచారం అందవలసి ఉంది. మూడు రోజులుగా తీవ్ర ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో వాతావరణం చల్లబడింది దీంతో ప్రజలు ఉపశమనం పొందారు.