తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి కుటుంబ సమేతంగా శనివారం మధ్యాహ్నం విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి సుబ్బారెడ్డి వీరికి ఆలయ ఏఈఓ మోహన్ దక్షిణ గోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు కల్పించారు అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల గర్భాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీ మేధా గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ మోహన్ ఆలయ పిఆర్ఓ రవి ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు