తాత్కాలిక స్థలంలో కొనుగోలుదారులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వీధి వ్యాపారాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట వారు చేపట్టిన దీక్షలు శనివారం నాలుగు రోజుకు చేరుకుంది. ఈ దీక్షలకు ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు నజీర్, మాజీ వైస్ ఛైర్మన్ జహీర్ రంజాని మద్దతు తెలిపారు. ప్రధాన చౌక్లలో డివైడర్లను తొలగించి తమకు వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు.