కామ్రేడ్ సీతారాం ఏచురి భవన్ ను (విశాఖపట్నం జిల్లా సిపిఎం కార్యాలయం) గురువారం ఉదయం విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీ ప్రాంతంలో సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశిష్టతగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు హాజరు కాగా అతిధులుగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు ఎస్ పుణ్యవతి, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె. లోకనాథం, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బి పద్మ, సిపిఎం జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బి గంగారావు తదితరులు పాల్గొన్నారు.