Download Now Banner

This browser does not support the video element.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన హిందూపురంకు చెందిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

Anantapur Urban, Anantapur | Aug 23, 2025
అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హిందూపురం పట్టణంలోని శ్రీకంఠపురం కు చెందిన నర్సింహమూర్తి అనే వ్యక్తి మృతి చెందాడు. శుక్రవారం ఉదయం హిందూపురం నుంచి లేపాక్షి రోడ్డులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us