పల్నాడు జిల్లా,వెల్దుర్తి మండలం యర్రబాలెం గ్రామంలో భక్తులకు అరుదైన ఘటన చోటు చేసుకుంది.గురువారం స్థానిక శ్రీహరిహర బాలనాగేంద్రస్వామి దేవాలయం మెట్లపై నాగుపాము పడగవిప్పింది. ఈ దృశ్యాన్ని చూసేందుకు గ్రామస్థులు భారీగా తరలివచ్చారు. దీంతో గ్రామంలో భక్తిశ్రద్ధలతో కూడిన వాతావరణం నెలకొంది.అదేక్రమంలో కొంతమంది భక్తులు భయాందోళనకు గురైయ్యారు.