పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యా నాణ్యతను మరింత మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ మంగళవారం సాయంత్రం ఐడీఓసీ సమావేశం హాల్ నందు విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పదవ తరగతి-2025 ఫలితాలలో రాష్ట్రంలో 32వ స్థానంలో నుండి 26వ స్థానానికి చేరుకుని 10.36% వృద్ధితో మంచి ఫలితాలు సాధించిందని తెలిపారు.ఈ విజయానికి తోడ్పడిన అధికారులు, ఉపాధ్యాయులను అభినందిస్తూ, ఈసారి మరింత నాణ్యమైన విద్య ను అందించేందుకు కృషి చేయాలన్నారు..