కళ్యాణదుర్గంలో శుక్రవారం మిలాద్ ఉన్ నబి పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. మక్కా మసీదు నమూనాలతో ర్యాలీ నిర్వహించారు. ప్రధాన మసీదు వద్ద నుంచి పుర వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడారు. మిలాద్ ఉన్ నబి చాలా పవిత్రమైన పండుగన్నారు. అందరూ సంతోషంగా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.