లో లెవెల్ వంతెనలపై పొంగిపొర్లుతున్న నీరు కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లో లెవెల్ వంతెనలపై నుంచి భారీగా నీరు ప్రవహిస్తోంది. అరకండ్ల బ్రిడ్జిపై నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. మెట్పల్లి గ్రామంలో లో లెవెల్ వంతెనపై నుంచి భారీగా నీరు ప్రవహిస్తుండడంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు హుజూరాబాద్ వైపు వెళ్లే ప్రజలు తెలిపారు.భారీ వర్షాలు కురిసినప్పుడల్లా లో లెవల్ వంతెనలపై ఇలా నీరు ప్రవహించడం వల్ల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లో లెవెల్ వంతెనలను హై లెవెల్ బ్రిడ్జిలు